సమాజం లో ప్రతి ఒక్కరి ఆలోచనలు మారాలి.నాటి సర్పయాగం నుంచి నేటి నిర్భయ వరకు ఇలాటి ఎన్నో వేడుకలు చూస్తున్నాం. పోరాడుతున్నాం. మర్చిపోతున్నాం. కళ్ళ ముందు నేరస్తులు ఉన్నా శిక్ష వేయలేని దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి సమాజం లో బ్రతుకుతున్నాము. ఇలాంటివి రొజూ ఏదో మూల ఎవరో ఒకరు ఇలా బలి అవుతూనే ఉన్నారు. దీనికి కారణం స్త్రీలకు సరైన చట్టాలు మరియు న్యాయాలు లేవు. ఒక్క సారి కాని అత్యాచారం చేసిన వెధవలకు శిక్ష వెంటనే అమలు జరపాలి.(ఆ శిక్ష ఆ చట్టం పేరు వింటేనే పుట్టాలి). స్త్రీల కోసం ప్రత్యేక పోలీస్ టీం ఉండాలి . నేరస్తులు తెలిసినా కూడా దర్యాప్తులు వాయిదాలు అని జాగారం చేస్తున్నారు. ఇలా కాదు స్త్రీలకు న్యాయం కావాలి. క్షణ కాల సుఖం కోసం అమ్మాయి ని వయసు వావి వరస అన్నీ మరచి ఒక మృగం లా మారి వేధిస్తుంటే పాపం అని కుడా జాలి పడని ఆ కర్కశ రాక్షస హృదయాలను కన్నది కుడా ఓ అమ్మే కదా.
Saturday, December 29, 2012
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment